నంద్యాల లో మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ , హాస్యనటుడు పద్మశ్రీ బ్రహ్మానందం

నంద్యాల పట్టణ శివారులో ఉన్న ఎస్ డి ఆర్ వరల్డ్ స్కూల్, ఆకాంక్ష జూనియర్ కాలేజ్ యొక్క దశమ వార్షికోత్సవ వేడుకలు ఘనముగా కన్నుల విందుగా విజయవంతముగా జరిగాయి ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు మరియు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖ హాస్య నటుడు విద్యావేత్త పద్మశ్రీ బ్రహ్మానందం గారు పాల్గొనడం జరిగింది

ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ విద్యార్థులు తమకు ఇష్టమైన కోర్సును ఎన్నుకొని అందులో ప్రతిభ కనబరచాలని అన్నారు. అలాగే ఈ కార్యక్రమములో 800 మంది విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని. పదివేల మందికి పైగా తల్లిదండ్రులు పాల్గొనడం జరిగిందని . ఇంతటి అద్భుతమైన కార్యక్రమమునకు వచ్చినందుకు సంతోషాన్ని ప్రకటిస్తూ ఇంతటి చక్కని కార్యక్రమాన్ని మొదటి నుండి పర్యవేక్షించిన సంస్థ అధినేత శనివారపు కొండారెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు

ఈ కార్యక్రమంలో పద్మశ్రీ బ్రహ్మానందం గారు విద్యార్థులను మరియు తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యను విద్యార్థి ఇష్టంగా చదవాలి కానీ కష్టంగా చదవకూడదు, తల్లిదండ్రులు ఎవరూ కూడా తమ పిల్లల మీద మానసికమైన ఒత్తిడి కి గురి చేయవద్దని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్విఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ వెంకటరామిరెడ్డి , మైన్స్ ఓనర్ దస్తగిరి రెడ్డి , జమ్మలమడుగు టిడిపి ఇన్చార్జ్ భూపేష్ రెడ్డి , గుండం శేషి రెడ్డి , పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ఎస్ విజయ్ శేఖర్ పాల్గొనడం జరిగింది

  • Related Posts

    చందాల శ్రీనివాసరావు ని పరామర్శించిన డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారు.

    ఇది నిజం టీవీ న్యూస్ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం మునగాలపల్లి గ్రామం లో అనారోగ్యం తో బాధపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చందల శ్రీను ను వారి నివాసనికి వెళ్లి ఆరోగ్యపరిస్థితిని పరిశీలించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన నందిగామ మాజీ…

    ఎస్సీ కాలనీలకు. మంచినీళ్ళ కరువు
    గాలికి వదిలేసిన కాంట్రాక్టర్లు
    పట్టించుకోని అధికారులు

    ఇది నిజం టీవీ న్యూస్చందర్లపాడు మండలం వెలది కొత్తపాలెం గ్రామం మంచినీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఎస్సీ కాలనీ వాసులు కేంద్ర రాష్ట్రాలు ప్రవేశపెట్టినటువంటి ఇంటింటికి మంచినీటి కార్యక్రమం గత నాలుగు నెలలు క్రితం ఇంటింటికి కులాయి కనెక్షన్ అయినది…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Idhi Nijam TV News Updates

    మద్యం మత్తులో భార్య అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు..

    మద్యం మత్తులో భార్య అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు..

    చందాల శ్రీనివాసరావు ని పరామర్శించిన డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారు.

    చందాల శ్రీనివాసరావు ని పరామర్శించిన డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారు.

    ఎస్సీ కాలనీలకు. మంచినీళ్ళ కరువు
    గాలికి వదిలేసిన కాంట్రాక్టర్లు
    పట్టించుకోని అధికారులు

    ఎస్సీ కాలనీలకు. మంచినీళ్ళ కరువు<br> గాలికి వదిలేసిన కాంట్రాక్టర్లు<br> పట్టించుకోని అధికారులు

    పదో తరగతి ఫలితాల విడుదలకు సిద్దం-టైమ్, వెబ్ సైట్, ఇతర వివరాలివే…!

    పదో తరగతి ఫలితాల విడుదలకు సిద్దం-టైమ్, వెబ్ సైట్, ఇతర వివరాలివే…!

    ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం, కోవెలకుంట్లలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2024 – 25 కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి గారు పాల్గొన్నారు

    ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం, కోవెలకుంట్లలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2024 – 25 కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి గారు పాల్గొన్నారు

    ఇది నిజం టీవీ న్యూస్ నందిగామ మండలం

    ఇది నిజం టీవీ న్యూస్ నందిగామ మండలం